ప్రియమణికి ఇంకా ఆ కోరిక తీరలేదంటా

పరుత్తివీరన్ సినిమాతో సౌత్ లో హీరోయిన్ గా ఎంట్రీ అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి ప్రియమణి.

ఆ సినిమా కంటే ముందు కన్నడంలో కొన్ని సినిమాలు చేసిన ప్రియమణికి జాతీయ అవార్డు తీసుకొచ్చిన సినిమాగా పరుత్తివీరన్ అందరికి గుర్తుండిపోయింది.

ఇక తెలుగులో పెళ్ళైన కొత్తలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగు ప్రేక్షకులకి కూడా భాగా చేరువ అయ్యింది.అయితే ఈ మధ్య అవకాశాలు తగ్గిపోవడంతో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయిన ప్రియమణి ప్రస్తుతం రియాలిటీ షోలకి జడ్జ్ గా వ్యవహరిస్తూ టాలీవుడ్ లో సంబంధాలు కొనసాగిస్తుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం వెంకటేష్ కి జోడీగా అసురన్ రీమేక్ గా ఈ భామ హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది.ఇదిలా ఉంటే తాజాగా ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 17 ఏళ్ళు పూర్తయిపోయాయని చెప్పింది.

అయితే తమిళ ఇండస్ట్రీలో అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదనే ఫీలింగ్ ఉందని చెప్పింది.అలాగే తన లైఫ్ లో నరసింహ సినిమాలో రమ్యకృష్ణ చేసినటువంటి నీలాంబరి తరహాలో నెగిటివ్ రోల్ చేసి ప్రూవ్ చేసుకోవాలని ఉందని, అయితే అలాంటి అవకాశం తనకి ఇంకా రాలేదని చెప్పింది.

Advertisement

తన వాయిస్ నెగిటివ్ గా ఉంటుందని అలాంటి పాత్రలు వస్తే ప్రూవ్ చేసుకొని తన డ్రీం రోల్ ఫినిష్ చేసుకుంటే సినిమా ఇండస్ట్రీలో కాస్తా సంతృప్తి ఉంటుందని చెప్పింది.తనకి కెరియర్ ఆరంభంలో పెద్ద పెద్ద లెజెండరీ దర్శకులతో నటించే అవకాశం వచ్చిందని, అయితే ఆ చరిష్మాని కొనసాగించలేకపోయా అని చెప్పింది.

మరి ప్రియమణి కోరుకున్నట్లు నెగిటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రని ఎవరైనా తనకి ఇస్తారేమో అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు