ఎన్నికలలో గెలుపు చంద్రబాబు నివాసంలో సంబరాలు..!!

ఏపీలో ఎమ్మెల్యే కోటాలో జరిగినా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ( Panchumurti Anuradha )గెలవటం సంచలనం సృష్టించింది.ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో మ్యాజిక్ ఫిగర్ 22 దాటితే.

 Victory In The Election Celebrations At Chandrababu's Residence , Panchumarthi A-TeluguStop.com

విజయం ఖాయం.కానీ తెలుగుదేశం పార్టీ బలం 19.దీంతో టీడీపీ పోటీకి దిగటమే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.ఈ క్రమంలో పోటీపడిన అభ్యర్థి అనురాధకీ 23 ఓట్లు రావడంతో వైసీపీ( YCP ) నుండి క్రాస్ ఓటింగ్ పడటం జరిగింది.

ఈ పరిణామంతో అనురాధ గెలవడంతో… రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ), నారా లోకేష్( Nara Lokesh ) ఎన్నికల్లో విజయం సాధించిన అనురాధాను అభినందించడం జరిగింది.చంద్రబాబు నివాసంలో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకుని వేడుకలు చేసుకున్నారు.ఈ సందర్బంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చేనాయుడు మాట్లాడుతూ.2019 ఎన్నికల్లో 23 సీట్లే గెలిచారని వైసీపీ ఎద్దేవా చేసింది.చివరికి 23వ తేదీన 23 ఓట్లతో వైసీపీ ఓటమి చెంది… టీడీపీ గెలుపొందింది అని సంతోషం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube