ఏపీలో ఎమ్మెల్యే కోటాలో జరిగినా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ( Panchumurti Anuradha )గెలవటం సంచలనం సృష్టించింది.ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో మ్యాజిక్ ఫిగర్ 22 దాటితే.
విజయం ఖాయం.కానీ తెలుగుదేశం పార్టీ బలం 19.దీంతో టీడీపీ పోటీకి దిగటమే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.ఈ క్రమంలో పోటీపడిన అభ్యర్థి అనురాధకీ 23 ఓట్లు రావడంతో వైసీపీ( YCP ) నుండి క్రాస్ ఓటింగ్ పడటం జరిగింది.
ఈ పరిణామంతో అనురాధ గెలవడంతో… రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ), నారా లోకేష్( Nara Lokesh ) ఎన్నికల్లో విజయం సాధించిన అనురాధాను అభినందించడం జరిగింది.చంద్రబాబు నివాసంలో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకుని వేడుకలు చేసుకున్నారు.ఈ సందర్బంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చేనాయుడు మాట్లాడుతూ.2019 ఎన్నికల్లో 23 సీట్లే గెలిచారని వైసీపీ ఎద్దేవా చేసింది.చివరికి 23వ తేదీన 23 ఓట్లతో వైసీపీ ఓటమి చెంది… టీడీపీ గెలుపొందింది అని సంతోషం వ్యక్తం చేశారు.