టాలీవుడ్ యంగ్ హీరోల్లో నితిన్ ( Nithin ) ఒకరు.ఈయన తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుని యూత్ స్టార్ గా ప్రేక్షకుల చేత పిలిపించు కుంటున్నాడు.
అయితే ఈ మధ్య కాలంలో నితిన్ చేస్తున్న సినిమాలు ఒకటి హిట్ అయితే వరుసగా రెండు మూడు ప్లాప్స్ పడుతున్నాయి.భీష్మ ( Bheesma ) వంటి సూపర్ హిట్ అందుకున్న నితిన్ ఆ తర్వాత మాత్రం మరో హిట్ అందుకోలేక పోయాడు.
వెంకీ కుడుముల( Venky kudumula ) దర్శకత్వంలో నితిన్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika ) హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ ముగ్గురికి ఘన విజయం అందించింది.దీంతో ఈ కాంబో అంటే అందరికి స్పెషల్ క్రేజ్ ఏర్పడింది.
ఇక ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా మరోసారి ఈ కాంబోలో సినిమా ప్రకటించి అందరికి సర్ప్రైజ్ ఇచ్చారు.మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా ఈ రోజు అనౌన్స్ మెంట్ చేసారు.
ఒక కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేస్తూ అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.ఈ వీడియో ఆద్యంతం ఆకట్టు కుంటుంది.దీంతో అనౌన్స్ మెంట్ రోజే ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచారు.ఈ వీడియోలో నితిన్, రష్మిక మందన్న, వెంకీ కుడుములతో పాటు సంగీత డైరెక్టర్ జివి ప్రకాష్ కూడా కనిపించారు.
వీరు ఒకరిపై ఒకరు పంచెస్ వేసుకోవడం అందరిని ఆకట్టుకుంది.
ఈ సినిమా మునుపటిలా ఛలో, భీష్మ లా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుంది అని వెంకీ కుడుముల తెలిపారు.ఈ సినిమా టైటిల్, మిగతా విషయాలు అతి త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు.ఇక ఈ వీడియోలో ఒక వ్యక్తి బైక్ నడుపుతున్నట్టు అలానే బైక్ నంబర్ ప్లేట్ పు నేను చాలా అరుదైన వ్యక్తిని అని నాకు తెలుసు అని రాసి ఉంది.
అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది.చూడాలి ఈ కాంబో ఎలా ఆకట్టుకుంటుందో.