టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో సురేందర్ రెడ్డి( Surendar Reddy ) ఒకరు కాగా అతనొక్కడే, కిక్, రేసుగుర్రం సినిమాల విజయాలతో ప్రశంసలు అందుకున్న సురేందర్ రెడ్డి ఈ ఏడాది ఏజెంట్ సినిమాతో( Agent Movie ) షాకింగ్ ఫలితాన్ని సొంతం చేసుకున్నారు.ఈ సినిమా ఏ రేంజ్ డిజాస్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఏజెంట్ తర్వాత సురేందర్ రెడ్డికి ఛన్స్ ఇవ్వడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
అయితే విక్టరీ వెంకటేశ్( Venkatesh ) ప్రస్తుతం సైంధవ్ సినిమాతో బిజీగా ఉన్నారు.
సైంధవ్ సినిమా( Saindhav ) 2024 సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.అయితే ఈ సినిమా రిలీజైన తర్వాత వెంకటేశ్ సురేందర్ రెడ్డి కాంబో మూవీ షూట్ మొదలయ్యేఛాన్స్ ఉంది.
ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.వెంకటేశ్ సురేందర్ రెడ్డి కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
భూపతిరాజా ఈ సినిమాకు కథ అందిస్తుండగా ఫ్యామిలీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.వెంకటేశ్ కామెడీ టైమింగ్ హైలెట్ అయ్యేలా ఈ సినిమాను ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది.పవన్( Pawan Kalyan ) సురేందర్ రెడ్డి కాంబో మూవీ అంతకంతకూ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ మూవీ దిశగా సురేందర్ రెడ్డి అడుగులు వేస్తున్నారని సమాచారం.ఈ సినిమా మరో ఏజెంట్ కాకపోతే చాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సురేందర్ రెడ్డి తన డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి ఈ సినిమాతో సక్సెస్ సాధించకపోతే అయన కెరీర్ ప్రమాదంలో పడే ఛాన్స యితే ఉంటుందని చెప్పవచ్చు.స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ పాన్ ఇండియా సినిమాలలో నటించి వరుస విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.