మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) పెళ్లి వేడుకలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయని తెలుస్తుంది.నటుడు నాగబాబు కుమారుడిగా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైనటువంటి ఈయన మిస్టర్ సినిమా సమయంలో నటి లావణ్య త్రిపాఠి( Lavanya Tripati ) తో ప్రేమలో పడ్డారు.
అయితే ఇన్ని సంవత్సరాల పాటు రహస్యంగా ప్రేమ ప్రయాణం చేస్తున్నటువంటి ఈ జంట జూన్ 9వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు.ఇలా జూన్ 9వ తేదీ నిశ్చితార్థం జరుపుకున్నటువంటి ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
అయితే వీరి పెళ్లి విదేశాలలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతుందని తెలుస్తోంది.ఇంకా ఇప్పటివరకు వీరి పెళ్లి ఎక్కడ ఎప్పుడు అనే విషయాలను ప్రకటించలేదు.
ఇకపోతే త్వరలోనే వీరీ పెళ్లి ఉందని స్పష్టంగా అర్థం అవుతుంది.ఇప్పటికే వీరిద్దరూ పెళ్లి పనులలో ఎంతో బిజీగా ఉండగా తాజాగా మెగా కుటుంబంలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ( Pre Wedding Celebrations ) ఎంతో ఘనంగా ప్రారంభం అయ్యాయి.ఈ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా మెగా అల్లు కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే చోట చేరి పెద్ద ఎత్తున సందడి చేశారని తెలుస్తుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వరుణ్ తేజ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయని చెప్పుకొచ్చారు.
ఇలా మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే ప్రేమ్ లో కనిపించడంతో అభిమానులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ వేడుకలకు అల్లు అర్జున్ దంపతులు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా దూరంగా ఉన్నారు.ప్రస్తుతం అల్లు అర్జున్ స్నేహ రెడ్డి లండన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే.అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని తయారు చేయడం కోసం కొలతలు ఇవ్వడానికి లండన్ వెళ్లారనే విషయాన్ని తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఇక పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్ర రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నా నేపథ్యంలో వారిద్దరూ హాజరు కాలేదు.
మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే చోట చేరి పెద్ద ఎత్తున సందడి చేశారని తెలుస్తోంది.ఇక కాబోయే వధూవరులతో ప్రతి ఒక్కరు కూడా ఫోటోలు దిగడం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.