సంక్రాంతి బరిలో చిరు, బాలయ్యలతో పాటుగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ వారసుడు కూడా రిలీజ్ అవుతుంది.ఈ సినిమా రిలీజ్ విషయంలో థియేటర్ల గొడవ తెలిసిందే.
దిల్ రాజు నిర్మించడం వల్ల వారసుడికి మంచి థియేటర్స్, ఎక్కువ సెంటర్స్ కేటాయించారట.ఈ క్రమంలో మెగా, నందమూరి ఫ్యాన్స్ కొద్దిగా హర్ట్ అవుతున్నారు.
అయితే సినిమా మీద నమ్మకంతో దిల్ రాజు ఈ సాహసం చేస్తున్నా.సంక్రాంతి అంటేనే బాక్సాఫీస్ కి పండుగ వైభవం తెస్తుంది.
ఆ టైం లో తెలుగు స్టార్స్ కి పోటీగా దిల్ రాజు వారసుడిని రిలీజ్ చేయడం రిస్క్ అని చెప్పొచ్చు.
చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ధాటికి వారసుడు తట్టుకుంటాడా లేదా అన్నది చూడాలి.
వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన వారసుడు సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా థమన్ మ్యూజిక్ అందించారు.
సంక్రాంతికి తెలుగులో భారీ టార్గెట్ తో వస్తున్న వారసుడు వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డిల ముందు తట్టుకుని నిలబడతాడా లేదా అన్నది చూడాలి.