మరొక సినిమాను లైన్లో పెట్టిన వైష్ణవ్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న హీరో వైష్ణవ్ తేజ్.ఉప్పెన హిట్ తో ఒక్కసారిగా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు.

కరోనా తర్వాత టాలీవుడ్ ను మళ్ళీ కోలుకునేలా చేసిన సినిమాల లిస్టులో ఉప్పెన కూడా ఉంది.తొలి సినిమాతోనే 100 కోట్ల మార్క్ అందుకున్న ఘనత కూడా వైష్ణవ్ తేజ్ కే దక్కింది.

వైష్ణవ్ తేజ్ కు మాత్రమే కాదు ఈ సినిమా దర్శకుడికి, హీరోయిన్ కు కూడా ఇది మొదటి సినిమానే.ఈ సినిమాను బుచ్చిబాబు సానా తెరకెక్కించారు.

ఇందులో నటించిన హీరోయిన్ కృతి శెట్టి కూడా ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపొయింది.ఈ సినిమా తర్వాత ఈ అమ్మడికి వరస పెట్టి ఆఫర్లు వస్తున్నాయి.

Advertisement

మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు.ఉప్పెన భారీ హిట్ తర్వాత వైష్ణవ్ తేజ్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం అందరికి తెలిసిందే.

ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కూడా ఒక సినిమా చేయబోతున్నాడని సమాచారం.

అయితే ఈ రెండు సినిమాలతో పాటు వైష్ణవ్ తేజ్ ఇప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.ఈ మధ్య జాతి రత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనుదీప్ కేవీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా నటించారు.ఇప్పటికే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ సృష్టిస్తుంది.ఇప్పటికే 40 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతుంది.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

ఈ సినిమా దాటికి పెద్ద సినిమాలు కూడా తేలిపోయాయి.ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అనుదీప్, వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉంటుందని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు