రెజ్లర్ల సమస్య సున్నితమైందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.క్రీడాకారుల డిమాండ్లను నెరవేరుస్తున్నామని చెప్పారు.
ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తరువాత అవసరమైన చర్యలు తీసుకుంటారని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.చట్టం అందరికీ సమానమేనన్న ఆయన నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షించి తీరుతామని వెల్లడించారు.