తెలంగాణాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 47 శాతం ఓట్లు టీఆర్ఎస్ ఖాతాలో పెద్దాయన్ని… ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.ట్రక్కు గుర్తుతో సుమారు 2 లక్షల ఓట్లు టీఆర్ఎస్ కు దూరమయ్యాయని.
లేకపోతే … 50శాతం ఓట్లు కూడా వచ్చేవి కాదన్నారు.తాజాగా తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన అనేకమంది నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ చేరిన సందర్భంగా… కేసీఆర్ మాట్లాడారు.
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఎవరూ గెలవలేదని, అందుకే మమ్మల్ని కూడా ముందస్తుకు వెళ్లోద్దని చాలామంది సూచించారని కాకపోతే… సీఎం కేసీఆర్.అలాంటి మాటలను పట్టించుకోకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లి రికార్డు సృష్టించారని కేటీఆర్ అన్నారు.
ఎన్నికల ఫలితాలు చూసి.కాంగ్రెస్ నేతలకు బుర్రలు పని చేయడం లేదని.తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుకు వారికి దిమ్మ తిరిగిందని కేటీఆర్ అన్నారు.పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసే పరిస్థితి లేదని ఆయన అభిప్రాయపడ్డారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానా రెడ్డిలకు అహంకారమని.ఏనాడూ వారు జడ్పీ మీటింగ్కు హాజరు కాలేదని గుర్తు చేశారు.