సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట తర్వాత ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ చేసాడు.ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఇటీవలే షూట్ మొదలు పెట్టారు.
సెప్టెంబర్ 12న ఈ సినిమా హైదరాబాద్ లో స్టార్ట్ అవ్వగా విరామం లేకుండా షూటింగ్ జరిగింది.ముందుగా ఫస్ట్ షెడ్యూల్ లోనే యాక్షన్ సన్నివేశాలతో త్రివిక్రమ్ స్టార్ట్ చేసాడు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం త్రివిక్రమ్ పక్కా ప్లాన్ తో బరిలోకి దిగాడు.
రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుపుకుంది.
ఒక యాక్షన్ సీక్వెన్స్ ను ఇప్పటికే పూర్తి చేసారు.అయితే సెకండ్ షెడ్యూల్ దసరా తర్వాత స్టార్ట్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేసి కొద్దిగా బ్రేక్ ఇచ్చాడు.
కానీ ఈ లోపే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి గారు మరణించారు.దీంతో ఘట్టమనేని ఇంట్లో మరోసారి విషాదం చోటు చేసుకుంది.
మహేష్ బాబుకు తల్లితో చాలా అటాచ్ మెంట్ ఉంది.ఎంత స్ట్రెస్ అయిన తన తల్లి దగ్గరికి వెళ్లి కప్ కాఫీ తాగితే మొత్తం సెట్ అవుతుంది అని మహేష్ చాలా సార్లు తన తల్లి గురించి చెప్పాడు.
మరి అలాంటి తల్లి ఇక లేరు అని తెలిసి ఈయన చాలా క్రుంగి పోయారు.
దీంతో ఈయన ఇప్పట్లో షూట్ లో పాల్గొనే అవకాశం లేదు.దీంతో మహేష్ బాధ అర్ధం చేసుకున్న త్రివిక్రమ్ కూడా ఈయనను ఎలాంటి డిస్టర్బ్ చేయకూడదు అని డిసైడ్ అయ్యారట.ఈయనకు కావాల్సినంత సమయం ఇచ్చిన తర్వాతనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది.
త్రివిక్రమ్ ఇప్పటికే మహేష్ కు కూడా ఈ విషయం చెప్పారట.దీంతో ఈ సినిమా షెడ్యూల్స్ లో మరోసారి మార్పులు చోటు చేసుకోనున్నాయి.
చూస్తుంటే దసరా తర్వాత కూడా మహేష్ 15 నుండి 20 రోజులు బ్రేక్ తీసుకుని అప్పుడు సెట్ లో అడుగు పెట్టే అవకాశం ఉంది.ఈ లోపు త్రివిక్రమ్ తర్వాత షెడ్యూల్ ప్లాన్ చేసుకునే పనిలో ఉన్నట్టు టాక్.ఇక ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.