సినిమా ఇండస్ట్రీలో కొంత మంది అగ్ర హీరోలుగా వెలుగొందుతున్న, మరికొంతమంది మాత్రం వారికి వచ్చిన అవకాశాలతో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు, ఇంకొందరు మాత్రం స్టార్ స్టేటస్ వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల సూసైడ్ చేసుకుని చనిపోయిన వారు ఉన్నారు.
ఇంకొందరు ప్రమాదవశాత్తు మరణించిన వారు కూడా ఉన్నారు ఏదేమైనా వాళ్ళు మంచి ఆర్టిస్ట్ గా, టెక్నీషియన్లు గా ఉన్నప్పుడు చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం.
వారు చనిపోయిన తర్వాత ఆస్తులను ఇంట్లో వాళ్ళు తీసుకుని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అలాంటి వారెవరో ఇప్పుడు చూద్దాం.
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా చేయాలి అంటే అది సౌందర్య గారు మాత్రమే చేయాలి అనే రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్నారు.చిరంజీవి,బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్ర హీరోలతో నటిస్తూ అలాగే జగపతి బాబు,శ్రీకాంత్ లాంటి మీడియం రేంజ్ హీరోలతో కూడా సినిమాలు తీసి మంచి విజయాన్ని అందుకున్నారు.చిరంజీవితో అన్నయ్య లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సాధించారు, అలాగే బాలకృష్ణ తో టాప్ హీరో లాంటి సినిమాలో నటించి మెప్పించారు,నాగార్జునతో హలో బ్రదర్ లాంటి సినిమాలో నటించి తన ప్రతిభని చూపించారు.
అలాగే రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన శ్రీరామదాసు సినిమా లో కూడా హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సాధించారు.వెంకటేష్ తో పవిత్ర బంధం,ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పెళ్లి చేసుకుందాం, రాజా లాంటి సినిమాల్లో నటించి తనదైన గుర్తింపును సాధించుకున్నారు.
సౌందర్య రఘు అని బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తున్ని పెళ్లి చేసుకున్నారు.ఒక టైంలో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని ఏ ప్రేక్షకుల్ని అడిగిన సౌందర్య పేరు చెప్పేవారు.
అలాంటి సౌందర్య రాజకీయ పార్టీ ప్రచారం కోసమని హెలికాప్టర్ లో వెళ్తున్నప్పుడు ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కూలిపోవడం జరిగింది దాంతో ఆవిడ మరణించారు.ఆ హెలికాప్టర్ లో ఆమెతో పాటు వాళ్ళ అన్నయ్య అయిన అమర్ నాథ్ కూడా ఉన్నారు ఆయన కూడా మరణించారు.
అయితే సౌందర్య చనిపోయిన తర్వాత తన ఆస్తి మొత్తాన్ని వాళ్ళ భర్తతోపాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వాటా ఇవ్వాలని తన వీలునామా రాసుకున్నది అని సౌందర్య వాళ్ళ అన్న అయిన అమర్ నాథ్ భార్య చెప్పారు.ప్రస్తుతం సౌందర్య ఆస్తిని తన భర్త తీసుకుని ఇంకో పెళ్లి చేసుకుని సౌందర్య ఆస్తిని అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడని చెపుతున్నారు.
త్రం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఉదయ్ కిరణ్ తర్వాత తీసిన నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగాడు లవర్ బాయ్ గా కూడా మారాడు.అయితే ఉదయ్ కిరణ్ కి చిరంజీవి కూతుర్ ని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు అనే న్యూస్ అప్పట్లో వచ్చింది,అనుకోని కారణాల వలన ఆ పెళ్లి అనేది ఆగిపోయింది దాని వలన ఉదయ్ కిరణ్ కి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదు, ఒకవేళ వచ్చిన అవకాశాలు కూడా సరిగా ఉపయోగపడలేదు.దాంతో డిప్రెషన్ లోకి వెళ్లి పోయిన ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
తను చనిపోయిన తర్వాత తన ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని వాళ్ళ భార్య గొడవ చేసి ఆస్తి తీసుకుని అమెరికా వెళ్లి అక్కడ వేరే అబ్బాయితో లివింగ్ రిలేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బాచి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు చక్రి.ఆ తర్వాత రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా కి కూడా చక్రినే మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నాడు పూరి.అంతటితో ఆగకుండా ఇడియట్,అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, దేశముదురు, నేనింతే, గోలీమార్ లాంటి సినిమాలకి చక్రినే మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నాడు.
ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేసిన చక్రి అనుకోకుండా గుండెపోటుతో మరణించడం జరిగింది.తదనంతరం ఆయన ఆస్తుల్ని వాళ్ల భార్య తీసుకొని అనుభవించటం జరుగుతుంది.వీళ్లు చనిపోతూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఆస్తి అప్పగించి వాళ్లు ఎంజాయ్ చేయడానికి ఒక రకంగా కారణమయ్యారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy