నేడు భారత్ -ఆస్ట్రేలియా మధ్య చివరి టీ20 సిరీస్ మ్యాచ్ జరగనుంది.హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
ఇప్పటికే టీ20 సిరీస్ మ్యాచ్ 1-1 తో టీమిండియా, ఆసీస్ లు సమఉజ్జీలుగా ఉన్నాయి.దీంతో నేడు జరుగబోయే మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే ఇరు జట్ల క్రీడాకారులు హైదరాబాద్ కు చేరుకున్న విషయం తెలిసిందే.







