జయంతి చౌహాన్( Jayanthi Chauhan ).ఈ పేరు మీరు అంతగా విని వుండరు.
కానీ ప్రముఖ ప్యాకేజ్డ్ వాటర్ బిజినెస్ కంపెనీ అయినటువంటి బిస్లెరీ ఇంటర్నేషనల్ గురించి తెలిసినవారికి ఈమె బాగా సుపరిచితులు.అవును, బిస్లరీ ఇంటర్నేషనల్ ఛైర్మన్ ‘రమేష్ చౌహాన్’( ‘Ramesh Chauhan’ ) కూతురే ‘జయంతి చౌహాన్’.
గత కొంతకాలంగా బిస్లరీ ఇంటర్నేషనల్ కంపెనీని ( Bislery International Company )విక్రయించనున్నారనే వార్తలు మీడియాలో వచ్చిన సంగతి తెలిసినదే.అయితే వాటన్నంటికీ ఇప్పుడు తెరదించారు.
కంపెనీని ప్రస్తుతం ఎట్టిపరిస్థితుల్లో విక్రయించబోమని రమేష్ చౌహాన్ స్పష్టం చేశారు.
వాస్తవానికి బిస్లెరీ విక్రయానికి సంబంధించి చర్చలు టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్తో గడిచిన నాలుగు నెలలుగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో బిస్లరీ బ్రాండ్ను టాటా గ్రూప్కు రూ.7,000 కోట్లకు విక్రయించాలని గతంలో అనుకున్నప్పటికీ, చివరికి రద్దయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇకపోతే జయంతి చౌహాన్ ప్రారంభంలో బిస్లరీ ప్లాంట్ ప్రాసెస్ ఆటోమేషన్పై ద్రుష్టి సారించి హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్తో పాటు సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్లో విశేషమైన మార్పులు తీసుకువచ్చి, కంపెనీని లాభాల బాట పట్టించింది.ఆ తరువాత 2011లో ఢిల్లీ నుంచి ముంబైకి షిఫ్ట్ అయిన ఆమె హిమాలయాస్ నేచురల్ మినరల్ వాటర్, బిస్లరీ హ్యాండ్ ప్యూరిఫైర్స్ వంటి కొత్త బ్రాండ్లను నడపడంలో కీలక పాత్ర పోషించారు.
టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తో చర్చలు ముగిసిన తరువాత ఆమె మరలా సంస్థకు సారథ్యం వహించే బాధ్యతలు స్వీకరించింది.దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని రమేష్ చౌహాన్ స్వయంగా మీడియాకు చెప్పారు.జయంతి చౌహాన్ లాస్ ఏంజిల్స్లోని ‘ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చండైజింగ్’లో ప్రాడక్ట్ డేవలప్మెంట్, లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ నుండి ఫ్యాషన్ స్టైలింగ్ అండ్ ఫోటోగ్రఫీ చదివింది.అంతే కాకుండా స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి అరబిక్ కూడా నేర్చుకున్నారు.