సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక మాయ చిత్రం.ఇక్కడ కనిపించినంత అందంగా ఎవరి జీవితాలు ఉండవు.ప్రతిరోజు ఒక పోరాటం చేయాలి.బ్రతకడానికి భవిష్యత్తుకు వెళ్లడానికి ప్రతిరోజు యుద్ధం చేయక తప్పదు.ఎక్కడ తమ పరుగు ఆగిపోతుందో అక్కడే తమకు అవకాశాలు తగ్గిపోతాయి. ఒక సినిమా ఫ్లాప్ అయింది అంటే రాత్రికి రాత్రే వారి అడ్రస్ గల్లంత కావచ్చు.
ఒక్క సినిమా హిట్ అయితే వారి పేరు మారుమ్రోగిపోవచ్చు.అందుకే ఒక సినిమా కన్నా ముందే ఒకటికి రెండు సినిమాలు విడుదలవడానికి లేదా ఏడాదిలో ఒక హిట్టు అయినా గట్టిగా కొట్టాలని ప్రతి ఒక్క హీరో లేదా హీరోయిన్ కోరుకుంటూ ఉంటారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో కొంతమంది కుర్ర హీరోయిన్ల రాకతో సీనియర్ హీరోయిన్ల జోరు తగ్గిపోతుంది.
అందులో మరీ ముఖ్యంగా రష్మిక మందన, పూజా హెగ్డే, సమంత వంటి హీరోయిన్లు వెనుకబడుతున్నారని చెప్పుకోవచ్చు.సమంత కేవలం హీరోయిన్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో హీరోలకు ఆమె దూరమైపోతూ వస్తోంది.అందుకే వరుసగా ఓ బేబీ, యశోద, శకుంతల వంటి సినిమాలతో వన్ సైడ్ హీరోయిన్ అయిపోయింది.
అందుకే హీరోలు ఎవరు అసలు ఆమెను కన్సిడర్ కూడా చేయడం లేదు.పైగా హిట్స్ పైన హిట్స్ కొడుతున్న కూడా ఇలా ఒక జోనర్ కి ఆమెను పరిమితం చేయడం పట్ల ఆమె అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు పూజా హెగ్డే పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది.
ఆమెకు రెండు మూడు సినిమాలు పరాజయం పాలవడంతో తెలుగులో అవకాశం ఇవ్వడానికి ప్రస్తుతం ఉన్న దర్శకులు వెనకడుగు వేస్తున్నారు.ఈ మధ్యకాలంలో పూజా హెగ్డే కనిపించడం కూడా పూర్తిగా తగ్గిపోయింది.సీనియర్ హీరోలు కూడా ఆమె వైపు చూడటం లేదు.
దాదాపు తెలుగులో కెరియర్ క్లోజ్ అయిందా అనే పరిస్థితి ఉంది.ఇక రష్మిక మందన్న విషయం మరోలా ఉంది.
ఆమె బాలీవుడ్ లో బిజీ అయింది అందుకే తెలుగులో సినిమాలు చేయడం లేదు.ఒక పుష్ప సీక్వెల్ మినహా మరి తెలుగు సినిమా ఆమె ఒప్పుకోవడం లేదు.
పరిస్థితి ఇలాగే కనిపిస్తే మరి కొన్ని రోజుల్లో రష్మిక పేరు కూడా తెలుగువారు మర్చిపోతారు.అందుకే అతి త్వరగా కనుమరుగయ్య హీరోయిన్స్ జాబితాలో రష్మిక చేరబోతోంది అని అంటున్నారు.