ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు రాణిస్తున్న విషయం తెలిసిందే.కేవలం వీరు మాత్రమే కాకుండా ఒకప్పుడు ఎంతోమంది సెలబ్రిటీలో అనేక రకాల కారణాలు వల్ల చనిపోయారు.
కొందరు ప్రమాదాల కారణంగా మరణిస్తే మరి కొందరు ఆరోగ్య పరిస్థితుల వల్ల కూడా మరణించారు.ఇకపోతే చనిపోయిన సెలబ్రిటీలను కొందరు దర్శకులు స్క్రీన్ పై చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారా.
చనిపోయిన సెలబ్రిటీ ని తెరపై చూపించడం ఏంటా అని అనుకుంటున్నారా.
మీరు విన్నది నిజమే ? ఇంతకీ ఆ సెలబ్రిటీలు ఎవరు ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.ఆల్రెడీ రాజమౌళి( Rajamouli ) సీనియర్ ఎన్టీఆర్ ను( Sr NTR ) జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమాలో( Yamadonga Movie ) గ్రాఫిక్స్ పెట్టి చూపించారు.తాత మనవడిని ఒకే ఫ్రేమ్లో చూసిన నందమూరి అభిమానులకు అవధులు లేకుండా పోయాయి.
అదేవిధంగా వెంకట ప్రభు( Venkat Prabhu ) దర్శకత్వంలో వస్తున్న విజయదళపతి అనే సినిమాలో ఇటీవలే మరణించిన విజయ్ కాంత్ గారిని( Vijaykanth ) మళ్లీ చూపించడం కోసం 14 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది.
అచ్చం విజయ్కాంత్ లాగే ఉండే విధంగా చూసుకుంటున్నారట మూవీ మేకర్.అలాగే తమిళ దర్శకుడు శంకర్( Shankar ) సినిమాలో చనిపోయిన వేణు గారు విజయ్ కాంత్ని అలాగే నిడుముడి వేణుని( Nedumudi Venu ) చూపించదానికి గ్రాఫిక్స్ ని ఉపయోగించారట.ఇలా ఈ విధంగా చనిపోయిన వారిని మళ్లీ సినిమాలలో చూపించబోతున్నారట
.