ప్రస్తుత కాలంలో ప్రతి సంవత్సరం ప్రమాదకర వ్యాధులు వచ్చి ప్రజలను ఎంతో ఇబ్బందికి గురి చేస్తున్నాయి.దానితో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఆరోగ్యం పై ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నారు.
రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగే వాటిని ప్రజలు తింటున్నారు. రాత్రంతా అంజీర పండ్లను నానబెట్టి ఉదయం తినడం వల్ల గుండె జబ్బుల నుంచి బ్లడ్ షుగర్ వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి.
ఎండిన అంజీర్ లేదా అత్తిపండ్లు తియ్యగా ఎంతో టేస్టీగా ఉంటాయి.మెత్తగా నమలడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి.ఈ పండ్లలో కొవ్వు కూడా ఎక్కువగా ఉండదు.వీటిలో చాలా తక్కువ సోడియం, ఫైబర్, కార్భోహైడ్రేట్లు ఉంటాయి.
ఈ అంజీర్ లను రాత్రంతా నానబెట్టి ఉదయం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఉన్నాయి.అయితే ఈ పండ్లను నేరుగా కూడా తినేయొచ్చు.
కానీ నీటిలో నానబెట్టి తింటే దీనినుంచి మరిన్ని ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు.
నానబెట్టి తినడం వల్ల అత్తిపండ్లలో కరిగే ఫైబర్ కంటెంట్ ను విచ్చిన్నం చేయడానికి సహాయపడుతుంది.
ఇందుకోసం 2 నుంచి 4 ఎండిన అంజీర ముక్కలను తీసుకోండి.ఒక చిన్న గిన్నె తీసుకుని దానిలో సగం నీటిని పోయండి.
అందులో అజీర ముక్కలను వేసి రాత్రంతా నానబెట్టండి.ఉదయం నానబెట్టిన పండ్లను పరిగడుపున తినండి.
వీటిపై తేనెను వేసుకుని కూడా తినొచ్చు.ఈ నానబెట్టిన పండ్లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి.
అత్తిపండ్లలో కాల్షియం ఎక్కువ ఉంటుంది.ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా అవసరం.అయితే మన శరీరం దానంతట అది కాల్షియాన్ని ఉత్పత్తి చేసుకోలేదు.కాబట్టి కాల్షియం ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం.అత్తిపండ్లతో పాటుగా కాల్షియం ఎక్కువగా ఉండే ఇతర పండ్లు, పాలు, ఆకు కూరలు, సోయా వంటి వాటిని ఎక్కువగా తింటూ ఉండాలి.