రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం( Yellareddypet ) రాచర్ల గొల్లపల్లి బైపాస్ రోడ్డులో గల శివ వైన్స్( Siva Wines ) లో ఈరోజు తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు.వైన్స్ షాప్ లోకి చొరబడి కొంత నగదును అపహరించుకపోయినట్లు నిర్వాహకులు తెలిపారు.
సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై రమాకాంత్ క్లూస్ టీం ద్వారా దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.







