Dharmana Prasada Rao : ప్రజల ఆస్తులను కాపాడటం కోసమే టైటిలింగ్ యాక్ట్ చట్టం..: మంత్రి ధర్మాన

ఏపీలో టైటిలింగ్ యాక్ట్ చట్టంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు( Dharmana Prasada Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.సుమారు 170 దేశాల్లో టైటిలింగ్ యాక్ట్ చట్టం ఉందని ఆయన తెలిపారు.

 The Titling Act Is To Protect Peoples Property Minister Dharmana-TeluguStop.com

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ( Land Titling Act )పై కేంద్రం కొన్ని సూచనలు చేసిందని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.నీతి ఆయోగ్( NITI Aayog ) చూపించిన మోడల్ ప్రకారం యాక్ట్ తీసుకొచ్చామన్నారు.

ఇంకా చట్టం అమలు చేయలేదన్న ఆయన కొన్ని మార్పులు చేయాల్సి ఉందని తెలిపారు.న్యాయవాదులకు( Lawyers ) కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో వారితో ముఖాముఖి మాట్లాడతామని వెల్లడించారు.న్యాయవాదుల సలహాలు, సూచనలు తీసుకుంటామని తెలిపారు.సర్వే పూర్తి చేసిన తరువాతే పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు.దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని కేంద్రం ఒత్తిడి తెస్తోందన్న ఆయన పేద ప్రజల ఆస్తులను కాపాడటం కోసమే టైటిలింగ్ యాక్ట్ చట్టమని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube