హైదరాబాద్ లో ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను రిమాండ్ కు తరలించారు.
ఈ క్రమంలో ముగ్గుర్ని కస్టడీకి కోరుతూ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ వేయనున్నారు.అంతేకాకుండా ఏ1 గా ఉన్న జాహెద్ వద్దకు గ్రనేడ్లపై విచారణను వేగవంతం చేశారు అధికారులు.
చైనా, నేపాల్ మీదుగా గ్రనేడ్లు జాహెద్ వద్దకు చేరిన సంగతి తెలిసిందే.అయితే, పాక్ లో ఉన్న ఘోరీ ద్వారా, డ్రోన్ల ద్వారా హర్యానాకు గ్రనేడ్లు చేరినట్లు గుర్తించారు.
అక్కడ నుంచి రోడ్డుమార్గంలో హైదరాబాద్ కు గ్రనేడ్లు చేరాయి.నిందితుల ఖాతాల్లో నగదు లావాదేవీలపైనా కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు.