కాంగ్రెస్ కు పూర్వ వైభవం వచ్చేది వీరితోనే... రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్ధకమైన ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సాధించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

జంగా రాఘవ రెడ్డి ఘటనపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించినా కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంది.

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఎక్కువగా ఉండడంతో ఎక్కువగా ఇటువంటి విషయాలతోనే వార్తలలో నిలుస్తుంది.ఏది ఎలా ఉన్నా ప్రస్తుతం కాంగ్రెస్ కు పూర్వ వైభవం విషయంపై ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీకి నాయకుల ద్వారా పూర్వ వైభవం రాదని స్థానిక కార్యకర్తల కృషితోనే పూర్వ వైభవం వస్తుందని వ్యాఖ్యానించారు.నాయకులు ఒక ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం సృష్టించగలరు కాని ఆ వాతావరణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే అవకాశం ఒక కార్యకర్తకు మాత్రమే ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు.

ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఒకవేళ రేవంత్ కు పీసీసీ ఇస్తే కార్యకర్తలను బలోపేతం చేయడమే ప్రధానలక్ష్యంగా ముందుకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

తాజా వార్తలు