టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.2019 వరకు స్టార్టప్ కంపెనీలకు ఏపీ గమ్యస్థానంగా ఉండేది.స్టార్టప్ కంపెనీలకు అనుకూలమైన వాతావరణం విశాఖపట్నంలో అప్పట్లో క్రియేట్ చేయడం జరిగింది.కానీ ఇప్పుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో స్టార్టప్ కంపెనీల వ్యవస్థ బీహార్ లో కంటే ఏపీలో దారుణంగా ఉందని చెప్పుకొచ్చారు.
ఇటువంటి పరిస్థితులు చూస్తుంటే రాష్ట్రం మరియు యువత భవిష్యత్తు చాలా ఆందోళన కలిగిస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు.విజయవాడలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలు ఆకాంక్షలను జగన్ ప్రభుత్వం దెబ్బతీస్తుందని ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల స్టార్టప్ ల పరిస్థితి ధ్వంసం అయిందని పేర్కొన్నారు.స్టార్టప్ కంపెనీల అభివృద్ధిలో బీహార్ కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిగువన ఉందని.చంద్రబాబు విమర్శించారు.