రైల్వే స్టేషన్లో( railway station ) అజాగ్రత్తగా వ్యవహరిస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.కానీ కొందరు చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటారు.
రైలు వస్తుంటేనే పట్టాలు దాటుతుంటారు.ఈ సమయంలో కింద పడటం లేదా పట్టాలపై పడటం ఆపై రైలు వచ్చి తొక్కేసి వెళ్ళిపోవడం వంటి ఘటనలు జరుగుతుంటాయి.
ఇప్పటికే ఇలాంటి నిర్లక్ష్యాల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారు.ఇటీవల ఒక తల్లి ట్రైన్ వస్తుండగా పట్టాలు దాటడానికి ప్రయత్నించింది.
ఆ సమయంలో పొరపాటున బిడ్డను పట్టాల మీద పడేసింది.అంతలోనే ఒక ట్రైన్ అదే పట్టాల మీదకు దూసుకొచ్చింది.
అదృష్టం కొద్దీ బిడ్డ పట్టాల మధ్యలో పడ్డాడు కానీ పట్టాలపై పడలేదు.అందువల్ల చక్రాలు బిడ్డను తొక్కలేదు.
దాంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను @casiMueren అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 9 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.వైరల్ వీడియో ఓపెన్ చేస్తే, వెళ్తున్న ఓ ట్రైన్, దానికిందే పట్టాల మధ్యలో ఒక పసిబిడ్డ కనిపించడం మనం చూడవచ్చు.
ట్రైన్ వెళ్లిపోయాక ఒక వ్యక్తి దిగి బిడ్డను పైకి తీసుకొచ్చాడు.అనంతరం ఆ చిన్నారిని చేతుల్లోకి కొందరు మహిళలు తీసుకున్నారు.అంత పెద్ద ప్రమాదం ఎదురైనా బాలుడికి ఏమీ కాకపోవడంతో ప్రజలు సంతోషించడం మనం గమనించవచ్చు.
పోలీస్ కూడా ఈ ప్రజల గుంపులో కనిపించారు.ఈ ఘటన భారతదేశంలోనే( India itself ) జరిగినట్లు తెలుస్తోంది.ఈ వీడియో చూసిన చాలామంది ఏ తల్లి తన బిడ్డను పట్టాల మీద అలా పడేయదు అని కామెంట్లు పెడుతున్నారు.
అసలు ఆ చిన్నారి ఆ పట్టాల మధ్యలోకి ఎలా వెళ్ళింది అని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.దేవుడి దయవల్ల బిడ్డకు ఏమీ కాలేదు అని మరి కొందరు రిలీఫ్ గా కామెంట్స్ చేశారు.
ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy