రామ్ చరణ్ - అల్లు అర్జున్ మధ్య గొడవలు

రామ్ చరణ్ - అల్లు అర్జున్ మధ్య సరైన సంబంధాలు లేవు అనే విషయం ఇప్పటిది కాదు.

దాదాపు రెండేళ్ళుగా బన్ని కి చెర్రికి సరిగా పడట్లేదని ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటూనే ఉన్నారు.

అదే నిజమేమో అనిపిస్తోంది తాజా సంఘటనలు చూస్తోంటే.రామ్ చరణ్ తదుపరి సినిమా ధృవకి అల్లు అరవింద్ నిర్మాత అన్న సంగతి తెలిసిందే.

పేరుకే అల్లు అరవింద్ నిర్మాత కాని, పెత్తనమంతా రామ్ చరణ్ దే కొనసాగుతోందని ఫిలింనగర్ జనాలు గుసగుసలు పెడుతున్నారు.తాజాగా, అల్లు అర్జున్, అల్లు అరవింద్ కి ఇష్టం లేని పని ఒకటి చేశాడు చరణ్.

అదేటంటే, ధృవ పబ్లిసిటి బాధ్యతలు ఆర్కా మీడియా, మరియు జనతా గ్యారేజ్ కి పీఅర్ టీమ్ లో పనిచేసిన ఓ వ్యక్తి చేతిలో పెట్టాడు.మీడియా మేనేజ్‌మెంట్‌ కోసం చరణ్ కొత్తగా గీతా ఆర్ట్స్ లోకి పట్టుకొచ్చిన టీమ్ బాగానే ఉన్నా, ఈ విషయం అల్లు క్యాంప్ కి నచ్చట్లేదట.

Advertisement

అందుకు కారణం, గీతా ఆర్ట్స్ చిత్రాలకి ఎప్పిటనుంచో పనిచేస్తున్న ఓ పీఆర్వోని కాదని, ఆర్కా మీడియా అండ్ వంశీ అనే పీఆర్ కి బాధ్యతలు అప్పజెప్పడమే.పాత పీఆర్వోని చరణ్ ఊరికే ఏం తీసెయ్యలేదు.

ఆ పీఅర్ టీమ్ పూర్తిగా అల్లు అర్జున్ క్యాంప్ కి చెందినది.బన్ని విధేయిలు తన సినిమాకి పనిచేయడం ఇష్టంలేకే చరణ్ ఈ పని చేసాడని టాక్.

Advertisement

తాజా వార్తలు