హైదరాబాద్ సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం..!!

హైదరాబాద్ శివారు ప్రాంతం రాజేంద్రనగర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

కంటైనర్ ను ఇన్నోవా కారు అతి వేగంతో వచ్చి ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు కాగా అందులో ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది.

దీంతో వెంటనే పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్లు గాయపడినవారిని హుటాహుటిన గచ్చిబౌలిలోని ఎఐజీ ఆసుపత్రకి తరలించారు.కారు ఆకస్మికంగా ధ్వంసం అవడంతో చాలావరకు పెద్ద పెను ప్రమాదమే చెప్పినట్లయింది.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ప్రమాదానికి గల కారణం డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే అని పోలీసులు గుర్తించారు.

అప్పా ఓఆర్ఆర్ కావటంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇదిలా ఉంటే కంటైనర్ మహారాష్ట్రకు చెందిన వాహనం అని.సమాచారం.

Advertisement
సినిమా వాళ్ళ దెబ్బకి విశ్వక్ సేన్ అడ్రస్ మార్చేశాడట !
Advertisement

తాజా వార్తలు