మెదక్ జిల్లా దౌల్తాబాద్లో ఉద్రిక్తత నెలకొంది.వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలపై టీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే దౌల్తాబాద్లో షర్మిల పోస్టర్లను టీఆర్ఎస్ కార్యకర్తలు చించివేసినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా షర్మిల యాత్రను అడ్డుకునేందుకు సన్నాహాలు చేస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
అయితే, నిన్న నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిపై షర్మిల విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.ఎమ్మెల్యే భూ కబ్జా, మట్టి మాఫియాకు అండగా ఉంటున్నారని ఆరోపణలు చేశారు.