కౌలు రైతు భరోసా యాత్ర...నాదెండ్ల మనోహర్

ప్రభుత్వ విధానాల కారణంగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.

వైయస్సార్ జిల్లా సిద్దవటంలో నేడు జరిగే కౌలు రైతు భరోసా యాత్ర మీటింగ్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ జిల్లాలో 170 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున జనసేన పార్టీ పవణ్ కల్యాణ్ చేతుల మీదుగా అందిస్తామన్నారు.

తాము సాయం అందించే ఏ కుటుంబంలో ఆయన రైతు ఆత్మహత్య చేసుకోలేదని నిరూపించే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని ఆయన ప్రశ్నించారు.బటన్లు నొక్కే పరిపాలన అంత బాగుంటే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో చెప్పాలన్నారు.

నాదెండ్ల మనోహర్ , పీఏసీ చైర్మన్ , జనసేన పార్టీ.

Advertisement
ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!

తాజా వార్తలు