గ్లామర్ డోస్ పెంచిన రత్తాలు... అందుకేనేమో...

తెలుగులో ప్రముఖ సీనియర్ నటుడు శ్రీకాంత్ హీరోగా నటించిన "కాంచన మాల కేబుల్ టివి" అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయమయిన "కన్నడ బ్యూటీ లక్ష్మీరాయ్" గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 అయితే లక్ష్మీ రాయ్ పరిశ్రమకు వచ్చిన మొదట్లో అడపాదడపా చిత్రాలతో బాగానే ఆకట్టుకున్నప్పటికీ క్రమక్రమంగా తన చిత్ర కథల విషయంలో అవగాహన లోపించడంతో ప్రేక్షకులని ఆకట్టుకోలేక పోయింది.ఈ క్రమంలో సినిమా అవకాశాలను దక్కించుకోలేక పోయింది.దీంతో ఒకానొక సమయంలో సినిమా అవకాశాలు లేక పలు స్పెషల్ సాంగ్స్ లో నటించడానికి కూడా సిద్ధమైంది.

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం150 చిత్రంలో "రత్తాలు రత్తాలు" అనే పాట లో నటించింది. ఈ పాట ఈ అమ్మడికి  మరిన్ని గ్లామర్ అవకాశాలు తెచ్చిపెట్టింది.

అయితే ఈ మధ్య కాలంలో లక్ష్మీ రాయ్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన అభిమానులకు బాగానే అందుబాటులో ఉంటోంది. అంతేగాక అప్పుడప్పుడు తన అందమైన ఫోటోలను అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ అందాల విందు చేస్తోంది.

 దీంతో తాజాగా రాయ్ లక్ష్మి బికిని దుస్తులు ధరించిన ఫోటోలని షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఈ అమ్మడి అందానికి ఫిదా అయ్యారు. అంతేకాక "బికినీలో రత్తాలు సెగలు పుట్టిస్తోందంటూ" కామెంట్లు చేస్తున్నారు.

 మరికొందరు ఈ మధ్య  లక్ష్మీ రాయ్ సినిమా అవకాశాల కోసం గ్లామర్ డోస్ పెంచిందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం లక్ష్మీ రాయ్ తమిళంలో "సిండ్రెల్లా" అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.

 అలాగే ఇటీవలే కన్నడ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం గురు ప్రసాద్  దర్శకత్వం వహిస్తున్న "ఝాన్సీ ఐపీఎస్" అనే చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రంలో రాయ్  లక్ష్మి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

అలాగే తెలుగులో ప్రముఖ దర్శకుడు "కర్రి బాలాజీ" దర్శకత్వం వహిస్తున్న "ఆనంద భైరవి" అనే చిత్రంలో కూడా నటిస్తోంది.

వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

తాజా వార్తలు