కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు కామెంట్స్.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏపీలో ఉన్న 5 కోట్ల జనాభాకు దేవాలయం లాంటిది.
శాసనసభను వైసీపీ కార్యాలయంగా మారింది.జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి 27 మంది మరణిస్తే.
ఆవిషయాన్ని శాసనసభలో ప్రతిపక్ష పార్టీగా సభ దృష్టికి తీసుకువెలితే.సాక్షాత్తు శాసనసభలో ఆమరణాలు సహజ మరణాలు అనడం శోచనీయం.
మా ఎమ్మెల్యేలకు మైకులు ఇవ్వడం లేదు కాబట్టే తాళాలతో నిరసన తెలిపాం.
నేడు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అబద్దాలు మాట్లాడుతూ సహజ మరణాలు అనడం దారుణం.2014 నుండి 2019 వరకు చంద్రబాబు తీసుకువచ్చిన సొంత బ్రాండ్లు ప్రస్తావన రాలేదు.నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి సరైన బ్రాండ్లు లేవు కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని షాపుల్లోని కొన్ని బ్రాండ్లు తీసుకొచ్చి టెస్ట్ చేస్తే కల్తీ మద్యం బయటపడుతుంది.
రాష్ట్రంలో ప్రతి మద్యం షాపులో కమిషన్ కోసం కల్తీ మద్యం అమ్మిస్తున్నాడు.
శాసనసభలో దానిపై చర్చిస్తే మమ్ములని బయటకు పంపించేస్తారు .ఎమ్మెల్యేలు మాత్రమే సెబ్ కార్యాలయంలో వినతి పత్రం అందిస్తే తప్పు ఏముంది.సీఎం జగన్మోహన్ రెడ్డి మద్యం అమ్మకం ద్వారా మహిళలకు సంక్షేమ పథకాలు ఇస్తాననడం దారుణం.కేవలం టీడీపీ నాయకులు కల్తీ మద్యం తాగవద్దు అని చెప్పి ప్రచారం చేస్తే రాష్ట్రానికి ఆదాయం ఎలా అనడం.
ఎన్నికల ముందు మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చావా లేదా.హామీ ఇవ్వలేదని చెబితే నేను రాజకీల్లో నుండి తప్పుకుంటాను.దశల వారి మద్యపానం నిషేదానికి అమలు చేసే దిశగా వెళితే షాపులు తగ్గించాలి కదా అలా తగ్గిస్తే ఆదాయం ఎలా పెరిగిందని చెబుతున్నారు.
స్పీకర్ కూడా సారా మీద చర్చ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఉంటే బాగుండేది.
జగన్ బ్రాండ్లు నిషేదించే వరకు టీడీపీ పోరాటాలు చేస్తూనే ఉంటుంది.రాష్ట్రంలో అన్నిరకాల ప్రజలు జంగారెడ్డిగూడెం మరణాలు కల్తీ సారా వల్లనే అంటే.
సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం సహజ మరణాలు అనడం దారుణం.ప్రజలు వాస్తవాలు గమనించాలని కోరుతున్నాను.