మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్( Vundavalli Arun Kumar ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీని విభజించి పదేళ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు.
విభజన హామీలు ఇప్పటివరకు అమలు కాలేదన్న ఆయన విభజన యాక్ట్ ఏ అంశం పూర్తి కాలేదని తెలిపారు.టీడీపీ, వైసీపీ రెండు ప్రభుత్వాలలోనూ పోలవరం ప్రాజెక్టు( Polavaram Project ) పూర్తి కాలేదన్నారు.
చంద్రబాబు( Chandrababu Naidu ) విభజన హామీల కోసం కృషి చేయలేదని ఓడించారన్న ఉండవల్లి వైసీపీ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదని విమర్శించారు.రెండు ప్రభుత్వాలు ప్రజలకు అన్యాయం చేశాయని ఆరోపించారు.వైసీపీకి( YCP ) 22 మంది ఎంపీలున్నా కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నారని మండిపడ్డారు.