సూర్యాపేట జిల్లా: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో స్వీప్ కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టాలని సూర్యాపేట జిల్లా అదనవు కలెక్టర్ బిఎస్.లత అన్నారు.
శనివారం కలెక్టరేట్ లో స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఓటు ఆవశ్యకత తెలిపే వాల్ పోస్టర్, ఫ్లెక్సీలను ఆమె ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ
జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొనే దిశగా సంబంధిత అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ సుదర్శన్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసరాజు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.