కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి తెలియని సినీ ప్రేక్షకులు లేరు.ఈయనకు కోలీవుడ్ లో మాత్రమే కాదు ఇండియా అంతటా ఫ్యాన్స్ ఉన్నారు.
సూర్య నటనకు ఫిదా అవ్వని ఫ్యాన్స్ లేరు అంటే అతియసోక్తి కాదేమో.గజినీ సినిమాతో తెలుగులో కూడా భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించు కున్నాడు సూర్య.
ఈ సినిమా తర్వాత ఈయనకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది.
అప్పటి నుండి ఈయన నటించిన అన్ని సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు.
ఇక ఇటీవలే సూర్య కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో క్యామియో రోల్ చేసిన విషయం తెలిసిందే.ఈ రోల్ కు విశేష స్పందన వచ్చింది.ఈ సినిమాతో మంచి స్పందన రావడమే కాకుండా సూపర్ హిట్ అవ్వడంతో ఈ సక్సెస్ ను సూర్య కూడా ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇది ఇలా ఉండగా ఈయన నటన పరంగా ఏ రేంజ్ లో మెప్పిస్తాడో అందరికి తెలుసు.
అద్భుతమైన పాత్రల్లో రాణిస్తూ వెర్సటైల్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు.ఇక ఈయన నటించిన జై భీమ్, ఆకాశమే నీ హద్దురా రెండు చిత్రాలు ఆస్కార్ అకాడమీ వరకు వెళ్లాయి.
అయితే రెండు సార్లు సూర్య ఫ్యాన్స్ కు నిరాశనే ఎదురైంది.ఇక ఇప్పుడు సూర్య ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ అందింది.
సూర్య కు ఆస్కార్ అకాడమీ నుండి స్వయంగా పిలుపు వచ్చినట్టు కన్ఫర్మ్ అవ్వడంతో ఫ్యాన్స్ ఇంతకు ముందు బాధ అంతా మర్చిపోయారు.2022 లో జరగబోయే ఆస్కార్ అకాడమీ వేడుక కోసం 397 మంది కొత్త ప్రముఖులను పిలుస్తుండగా.వారిలో సౌత్ ఇండియా నుండి సూర్య కు కూడా అవకాశం లభించింది.మన సౌత్ నుండి ఆస్కార్ వేడుకకు వెళ్తున్న ఏకైక హీరో సూర్యనే కావడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.