ఢిల్లీలో పాలనాధికారాల ఆర్డినెన్సుపై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.ఈ మేరకు ఆర్డినెన్స్ పై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే కేంద్రం తీసుకువచ్చిన పాలనాధికారాల ఆర్డినెన్స్ ను ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.ఈ పిటిషన్ పై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ క్రమంలోనే కేంద్రానికి ఆదేశాలు జారీ చేసిన సుప్రీం న్యాయస్థానం అనంతరం తదుపరి విచారణను ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది.







