వంద శాతం వీవీప్యాట్ల( VVPATs ) ట్యాలీ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్లను వంద శాతం ట్యాలీ చేసే విధంగా ఈసీకి( EC ) ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
ఈ మేరకు పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా( Justice Sanjeev Khanna ) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.కేరళలో మాక్ పోల్ సందర్భంగా అన్ని ఓట్లూ బీజేపీకీ నమోదైన విషయాన్ని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విషయంపై వెంటనే విచారణ జరపాలని సీఈసీకి సుప్రీంకోర్టు( Supreme Court ) కీలక ఆదేశాలు జారీ చేసింది.అనంతరం వంద శాతం వీవీప్యాట్ల ట్యాలీపై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.