బీహార్ లో కుల గణనపై స్టేటస్ కో ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.ఈ మేరకు బీహార్ ప్రభుత్వ కుల గణన సర్వేను సమర్థిస్తూ పాట్నా హైకోర్టు తీర్పు వెలువరించింది.
పాట్నా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఎన్జీవోలు సవాల్ చేసిన సంగతి తెలిసిందే.పూర్తి స్థాయి విచారణ తరువాతే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది.
కాగా పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎన్జీవో ఏక్ సోచ్ ఏక్ ప్రయాస్ పిటిషన్ దాఖలు చేసింది.అయితే కులగణనకు సంబంధించి బీహార్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొన్న సంగతి తెలిసిందే.







