మనిషి దైనందిత జీవితంలో తరచుగా వాడేవాటిలో బ్యాటరీలు( Batteries ) ఒకటి.వీటిలో 2 రకాలు గురించి మనకు బాగా తెలుసు.
ఒక రకం.ఒకసారి వాడి పారేసేవి.రెండో రకం మళ్లీ మళ్లీ వాడుకునేందుకు వీలుగా ఉండే రీఛార్జ్ బ్యాటరీలు.( Recharge Batteries ) ఒకసారి మాత్రమే వాడేవి తక్కువ ధరను కలిగి ఉంటాయి.
అదే రీఛార్జ్ బ్యాటరీ ధర దాదాపు 10 రెట్లు ఎక్కువ ఉంటుంది.రీఛార్జ్ చేసుకోతగ్గ బ్యాటరీలు.100 నుంచి 300 సార్లు రీఛార్జ్ చేసుకునేందుకు వీలుగా ఉంటాయి.వీటి వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇటువంటి వాటిని కెమెరాలు, గేమింగ్ రిమోట్ కంట్రోల్, సెల్ఫోన్లు, ల్యాప్టాప్ వంటి వాటిలో సహజంగా వాడుతూ ఉంటాం.వాడకం ఎక్కువ కాబట్టి.
అవసరానికి తగ్గట్టు వీటిని కొనుక్కుంటాం ఉంటాం.

సాధారణ బ్యాటరీలను( Normal Batteries ) మళ్లీ మళ్లీ ఎందుకు రీఛార్జ్ చెయ్యలేం? అనే ప్రశ్న చాలామంది మదిలో ఉంటుంది.దీనికి అసలు ఈ బ్యాటరీల తయారీలో ఉండే తేడా గురించి ముందు తెలుసుకోవాలి.సింగిల్ యూజ్ బ్యాటరీలలో.
అధిక శక్తి ఉండే రసాయనాలు కొద్దికొద్దిగా శక్తిని విడుదల చేసేవిగా మారతాయి.అందువల్ల ఇవి దీర్ఘకాలం మన్నుతాయి.
అందుకే వీటిని గాల్వానిక్ ఘటాలు అని కూడా అంటారు.ఇక రీఛార్జ్ బ్యాటరీలలో ప్రత్యేకమైన రసాయనిక శక్తి ఉంటుంది.

దీనికి కరెంటును కనెక్ట్ చెయ్యగానే వాని ఎక్కువగా పెరుగుతుంది.అలా మారిన శక్తిని మనం వాడేసుకోగానే.ఆ శక్తి తిరిగి తక్కువ శక్తి రసాయనంగా మారిపోతుంది.ఇక ఎవరి అవసరాన్ని బట్టి వారు రకరకాల బేటరీలను వాడుతూ వుంటారు.నేటి కాలంలో చాలామంది రీఛార్జబుల్ బేటరీలనే వాడుతూ వున్నారు.మన ప్రతిరోజూ వాడే సెల్ ఫోన్లలో వున్న బేటరీ రీఛార్జబుల్ బేటరీనే.
అదేవిధంగా మన ఇళ్లల్లో వాడే ఇన్వెర్టర్లు కూడా అంతే.ఇక ఎలక్ట్రికల్ వెహికల్స్( Electric Vehicles ) సంగతి అందరికీ తెలిసినదే.
అందుకే ఈ బేటరీ కలిగిన వస్తువులు అత్యంత ఎక్కువ ఖరీదుని కలిగి ఉంటాయి.







