పుష్ప సినిమా పాటలపై ఫోకస్ పెట్టిన సుకుమార్

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది.

ఇక ఈ సినిమాకి సంబందించిన పోస్టర్లు ఇప్పటికే రిలీజ్ చేసి సినిమా మీద ఇంటెన్సిటీ క్రియేట్ చేశారు.

రంగస్థలం తర్వాత మరోసారి సుకుమార్ మాస్ ఎంటర్టైనర్ కథాంశం ఎంచుకొని బన్నీని ఇప్పటి వరకు చూడని మాస్ యాంగిల్ లో చూపించబోతున్నాడు.ఇక ఈ సినిమా కథ మొత్తం చిత్తూరు ఎర్రచందనం స్మగ్లింగ్ నేపధ్యంలో ఉంటుందని తెలుస్తుంది.

రష్మిక ఇందులో అల్లు అర్జున్ కి జోడీగా ఒక గ్రామీణ యువతీ పాత్రలో కనిపించబోతుంది.ఇదిలా ఉంటే లాక్ డౌన్ తర్వాత రెగ్యులర్ షూటింగ్ లో కొన్ని షరతులతో ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

అయితే ఇప్పుడున్న పరిస్థితిలో అవుట్ డోర్ షూటింగ్ కాస్తా కష్టమైన పని.ఈ కారణంగా సుకుమార్ ఇప్పుడు ఇండోర్ షూటింగ్ లో ఉన్న పాటల చిత్రీకరణతో సినిమా స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడు.దేవిశ్రీ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమా పాటలతో స్టార్ట్ చేయాలని భావించడంతో ముందుగా వాటిని ఫినిష్ చేసే పనిలో పడ్డట్లు తెలుస్తుంది.

Advertisement

రంగస్థలం తరహాలోనే ఎక్కువ ఫోక్, మాస్ బీట్స్ మీదనే సుకుమార్ మరోసారి దృష్టి పెట్టి అలాంటి పాటలని దేవిశ్రీ నుంచి కోరుకుంటున్నట్లు తెలుస్తుంది.మరో వైపు షూటింగ్ కి సంబందించిన సరంజామ కూడా రెడీ చేసుకుంటున్నాడు.

మరి అఫీషియల్ లో షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనేది మాత్రం చిత్ర యూనిట్ ప్రకటించే వరకు వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు