తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.ఈ క్రమంలోనే తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ విద్యార్థి గుండెపోటుతో కన్నుమూశాడు.
స్నేహితులతో కబడ్డీ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు తనూజ నాయక్.వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ క్రమంలో కబడ్డీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మృతుడు తనూజనాయక్ మడకశిర మండలం అచ్చంపల్లి తండావాసిగా గుర్తించారు.







