సినిమా స్టైల్ లో పోలీసుల బండి వేసుకుని దోపిడికి పాల్పడ్డారు కొందరు దొంగలు.ఓ వ్యక్తి పెళ్లి కోసం దాచుకున్న డబ్బుతో భూమి కొనుగోలు చేయాలని బ్రోకర్ తో సంప్రదింపులు జరిపాడు.
భూమిని చూడటానికి వెళ్తున్న క్రమంలో కొందరు పోలీస్ వాహనంతో దిగి డబ్బులను, బ్రోకర్ ను పట్టుకుని పరారయ్యారు.బాధితుడు పోలీసులకు సంప్రదించడంతో అసలు విషయం బయట పడింది.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.విశాఖ జిల్లా మధురవాడకు చెందిన కోటేశ్వరరావు పెళ్లి కోసం, భూమిని కొనుగోలు చేయడానికి రూ.50 లక్షలు దాచుకున్నాడు.ఆ డబ్బులో 20 లక్షలు పెట్టి ఫ్లాట్ కొనుగోలు చేద్దామని అనుకున్నాడు.ఈ మేరకు ఓ బ్రోకర్ తో సంప్రదింపులు కూడా జరిపాడు.ఫ్లాట్ ఉందని చెప్పడంతో డబ్బు తీసుకుని బ్రోకర్ తో పాటు వైఎస్సార్ క్రికెట్ స్టేడియం దగ్గర్లో వెళ్తున్నారు.అదే సమయంలో అక్కడికి కొందరు పోలీస్ వాహనంలో సైరన్ వేసుకుని వీరి ముందు నిలబడ్డారు.
పోలీసులుగా నమ్మించి డబ్బుతో పాటు బ్రోకర్ ను కూడా వెంట తీసుకెళ్లారు.అయితే డబ్బులున్న విషయం బ్రోకర్ కి మాత్రమే తెలుసని కోటేశ్వరరావు పేర్కొన్నాడు.
దీంతో పోలీసులు బ్రోకర్ వివరాలు సేకరించే పనిలో పడ్డారు.