తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే వరుసగా మూడు సక్సెస్ లను అందుకొని ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ రికార్డును బ్రేక్ చేసిన హీరో ఉదయ్ కిరణ్…( Uday Kiran ) కెరియర్ మొదట్లో ఈయన మంచి విజయాలను అందుకున్నప్పటికీ ఆ తర్వాత ఆయనకు వరుసగా చాలా ఫ్లాప్ సినిమాలు రావడం వల్ల ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే.ఇక ఇదిలా ఉంటే ఉదయ్ కిరణ్ చేయాల్సిన కొన్ని సినిమాలు వేరే హీరోలు చేయడం వల్ల ఆ సినిమాలు సూపర్ సక్సెస్ లను అందుకున్నాయి.
అందులో ముఖ్యంగా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన దేశముదురు సినిమాను( Desamuduru Movie ) పూరి మొదట ఉదయ్ కిరణ్ తో చేయాలని అనుకున్నాడు కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ సినిమా ఆగిపోయింది.ఇక దాంతో ఆ సినిమాని అల్లు అర్జున్ తో( Allu Arjun ) చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు…ఇక ఇదిలా ఉంటే వినాయక్( Vinayak ) డైరెక్షన్ లో కూడా ఉదయ్ కిరణ్ ఒక సినిమా చేయాల్సింది.అయినప్పటికీ మధ్యలో కొన్ని అనువార్య కారణాల వల్ల ఆ సినిమాను కూడా క్యాన్సల్ చేశారు.ఇక మొత్తానికైతే ఉదయ్ కిరణ్ అన్ని రకాలుగా కెరియర్ ని మొత్తం కోల్పోయాడు.
దానివల్ల ఆయన ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకొని మరణించారు అనే వార్తలైతే అప్పట్లో పుష్కలంగా వచ్చాయి.ఇక ఇదిలా ఉంటే ఉదయ్ కిరణ్ లాంటి హీరో వరుసగా సక్సెస్ లను అందుకొని స్టార్ హీరోగా ఎదుగుతాడు అని అందరూ అనుకున్నారు.కానీ అనుకోని కారణాల వల్ల ఆయన కెరియర్ అనేది అర్థంతరంగా మురిసిపోవడం అనేది అప్పట్లో ఆయన అభిమానులను తీవ్రమైన కలవరానికి గురి చేసిందనే చెప్పాలి… ఇక ఇప్పుడు ఆయన నటించిన నువ్వు నేను సినిమా రీరిలీజ్ చేసి పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది…