టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణకు దైవభక్తి ఎక్కువనే సంగతి తెలిసిందే.బాలయ్య మూహూర్తాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చాలామంది భావిస్తారు.
బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అని అన్నారు.వాళ్లు ఏది అడిగితే అలా యాక్టింగ్ చేయడం నాకు ఇష్టమని బాలయ్య చెప్పుకొచ్చారు.
డ్యాన్స్ చేసే సమయంలో నేను చాలా ఎంజాయ్ చేస్తానని బాలకృష్ణ పేర్కొన్నారు.
జయాపజయాలు దైవాధీనాలు అని బాలయ్య అన్నారు.
లయన్ సినిమా కాన్సెప్ట్ నాకు బాగా నచ్చిందని అయితే ఆ సినిమా బాగా ఆడలేదని బాలయ్య చెప్పుకొచ్చారు.రోజూ గంట గంటన్నర పాటు పూజ చేస్తానని నేను అమెరికా వెళ్లినా పూజ విషయంలో నేను మారనని ఆయన చెప్పుకొచ్చారు.
నా ఇష్టదైవం లక్ష్మీ నరసింహ స్వామి అని బాలయ్య కామెంట్లు చేశారు.రాజకీయాల్లో ఎలాంటి యాంబిషన్ లేదని ఆయన పేర్కొన్నారు.
రాజకీయాల్లోకి వెళ్లొద్దని చాలామంది చెప్పారని నా మంచితనానికి పాలిటిక్స్ సూట్ కావని చాలామంది అన్నారని బాలకృష్ణ వెల్లడించారు.నేను పొద్దున్నే 3.30 గంటలకు లేస్తానని బాలయ్య పేర్కొన్నారు.బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా నుంచి ఈరోజు ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది.
వీరసింహారెడ్డి సినిమాకు హైలెట్ గా నిలిచే సాంగ్ ను ఈరోజు విడుదల చేయనున్నారు.
ఈ సాంగ్ కేవలం బాలయ్యపైనే షూట్ చేసిన సాంగ్ అని తెలుస్తోంది.మరోవైపు బాలయ్య, శృతి కాంబినేషన్ సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని అతి త్వరలో ఈ సాంగ్స్ కూడా రిలీజ్ కానున్నాయని సమాచారం.బాలయ్య సినిమాసినిమాకు తన రెమ్యునరేషన్ ను సైతం పెంచేస్తుండటం గమనార్హం.
బాలయ్య డిసెంబర్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాను కూడా మొదలుపెట్టనున్నారు.బాలయ్య సినిమాలన్నీ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.