స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమాల విషయంలో ఎంతో పర్ఫెక్ట్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.తను అనుకున్న షాట్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు రాజీ పడని దర్శకధీరుడు రాజమౌళి ఆర్.
ఆర్.ఆర్.సినిమాతో రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా శ్రియ రాజమౌళి గురించి, రాజమౌళి ఆరోగ్య సమస్య గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.
ఆర్.ఆర్.ఆర్ షూట్ సమయంలో జక్కన్న ఆస్తమాతో బాధ పడ్డారని శ్రియ తెలిపారు.
ఆర్.
ఆర్.ఆర్ మూవీలో చరణ్ తల్లి పాత్రలో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే.సినిమాలో శ్రియ పాత్ర పరిమితమే అయినా తన పాత్రకు ఆమె నూటికి నూరు శాతం న్యాయం చేశారు.ఆర్.ఆర్.ఆర్ మూవీ ప్రారంభానికి ముందు జక్కన్నను ఈ సమస్య వేధించిందని శ్రియ కామెంట్లు చేశారు.అయితే ఆ సమస్యతో బాధ పడుతున్నా ఆ సమస్యను లెక్క చేయకుండా జక్కన్న షూట్ చేశారని చెప్పుకొచ్చారు.
రాజామౌళి దృష్టి అంతా కథను ఏ విధంగా ప్రజెంట్ చేయాలని అనేదానిపై మాత్రమే ఉందని శ్రియ పేర్కొన్నారు.
సెట్ లో దుమ్ము ఎక్కువగా ఉన్నా రాజమౌళి అదే విధంగా వర్క్ చేస్తారని శ్రియ చెప్పుకొచ్చారు.తెరపై సినిమాను అద్భుతంగా చూపించాలని రాజమౌళి తాపత్రయపడతారని శ్రియ కామెంట్లు చేయడం గమనార్హం.
ఆర్.ఆర్.ఆర్ సినిమా ఇప్పటికీ రికార్డులను చేస్తున్న సంగతి తెలిసిందే.
చరణ్, తారక్ దాదాపుగా నాలుగేళ్లు ఆర్.ఆర్.ఆర్ కు సమయం కేటాయించగా ఆ కష్టానికి తగ్గ ఫలితం ఈ సినిమా దక్కిందనే సంగతి తెలిసిందే.ఈ సినిమాకు ఎన్నో అవార్డులు వస్తున్నాయి.రాజమౌళి ఒక్కో సినిమాకు 120 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు.
రాజమౌళి డిమాండ్ చేస్తే మరింత ఎక్కువ మొత్తం పారితోషికం ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.