ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై డా.జగన్ మోహన్ డి వై నిర్మాతగా వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’.
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం బెక్కం వేణుగోపాల్ సమర్పణలో విడుదలకు సిద్దమైయింది.ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.
ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగల్ ఏకథను మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ లాంచ్ చేశారు.ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ అద్భుతంగా ఆలపించిన ఈ పాటకు మధు కిరణ్ ఆకుట్టునే సాహిత్యం అందించారు.
ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ.”ఈ సాంగ్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది.సంగీత దర్శకుడు శివ, కోటి గారి దగ్గర తొమ్మిదేళ్ళు పని చేశారు.సంగీత ద్ఫర్శకుడిగా శివ మంచి విజయాలు అందుకోవాలి.పాటకు ఆక్సిజన్ నింపే శంకర్ మహదేవన్ గారు ఈ పాటని చాలా బ్రిలియంట్ గా పాడారు.మధు కిరణ్ ఈ పాట కు మంచి సాహిత్యం అందించారు.
రాజేంద్ర ప్రసాద్ అద్భుతమైన నటులు.ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశారు.
ఈ చిత్రం కూడా మరో మంచి చిత్రం అవుతుందని నమ్మతున్నాను.టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్” తెలిపారు.

ప్రేమ, తులసి రవిబాబు, శుభలేక సుధాకర్, ప్రభాస్ శ్రీను, రంగస్థలం మహేష్, ఇతర కీలక పాత్రలు పోహిస్తున్న ఈ చిత్రానికి మల్లికార్జున్ నరగాని డీవోపీగా, శివ దినవహి సంగీత దర్శకునిగా పనిచేస్తున్నారు.ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ డైలాగ్ అందించడం మరో విశేషం.
తారాగణం:
డాక్టర్ రాజేంద్రప్రసాద్, నరసింహరాజు, ప్రేమ, తులసి, రవిబాబు, శుభలేక సుధాకర్, నారాయణరావు, అనంత్, ప్రభాస్ శ్రీను, రంగస్థలం మహేష్, జోగి సోదరులు, ధనరాజ్, కంచరపాలెం కిషోర్, జెమిని సురేష్, తాగుబోతు రమేష్.
టెక్నికల్ టీమ్ :
రచన,దర్శకత్వం – వెంకటేష్ పెదిరెడ్ల, కథ, నిర్మాత – డా.జగన్ మోహన్ డి వై, సమర్పణ : బెక్కం వేణుగోపాల్, డీవోపీ – మల్లికార్జున్ నరగాని, సంగీతం – ఎస్ శివ దినవహి, డైలాగ్స్ – పరుచూరి బ్రదర్స్, ఎడిటర్ – రామ్ తుము, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మణికుమార్ పాత్రుడు, ఆర్ట్ డైరెక్టర్ – సురేష్ భీమగాని, పీఆర్వో – తేజస్వి సజ్జ.







