రాజస్థాన్లోని సవాయ్మాధోపూర్లోని రణ తంబోర్ పులుల అభయారణ్యం మధ్యలో. మూడు కళ్లు కల్గిన వినాయకుడి విగ్రహం ఉందంట.
అయితే ఈ వినాడకుడిని ఏ కోరిక కోరుకున్నా తీరుతుందనేది అక్కడి భక్తుల నమ్మకం. అయితే భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్న ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉందండోయ్.
అందేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఈ త్రినేత్ర వినాయకుడికి తమ సమస్యలను తెలుపుతూ.
ఆ కష్టాలను తీర్చమని వేడుకుంటూ భక్తులు ఉత్తరాలు రాస్తారట. అలా చేస్తే.
కచ్చితంగా ఆ సమస్యలు తీరిపోతాయట. జైపూర్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలోని సవాయ్ మాధోపూర్ జిల్లా రణతంబోర్ కోటలో ఉందీ మహిమాన్విత క్షేత్రం.
ఆరావళి, వింధ్య పర్వతాలు కలిసేచోట 1580 అడుగుల ఎత్తులో కొలువు దీరింది.అయితే ఈ మూడు కళ్ల వినాయకుడు స్వయం భువుగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి.
స్వామి వారు వెనక ఉన్న కొండ నుంచి ఉద్భవించారట. ఆయన ఇద్దరు భార్యలు బుద్ధి, సిద్ధి, కుమారులు శుభ్, లాభ్ విగ్రహాలను కూడా ఈ ఆలయంలో నెలకొల్పారు.
వెయ్యేళ్ల చరిత్ర కల్గిన ఈ గణేషుడికి మూడు కళ్లు ఉండటమే కాక ఉత్తరాలు కూడా రాయడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే సంతానం, ఉద్యోగం, పదోన్నతి, వ్యాపారం, ఇంట్లో గొడవలు.
ఇలా మరెన్నో చింతలు తీర్చమని త్రినేత్ర గణేశుడిని భక్తులు వేడుకుంటారు. వారి మనస్సుల్లో కోరుకున్న అన్నింటినీ ఆ గణ నాథుడు పూర్తి చేస్తాడట.
త్రినేత్ర గణేశ్ దర్శన భాగ్యంతోనే ప్రపంచంలోని అన్ని సమస్యలు దూరమై పోతాయని భక్తుల ప్రగాఢ విశ్యాసం. మీకూ వెళ్లాలనిపిస్తోందా.
అయితే రాజస్థాన్ వెళ్లాల్సిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy