ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.ట్రాన్స్జెండర్లకు శుభవార్త చెబుతూ వారి కోసం ప్రత్యేక పాలసీని అమలులోకి తీసుకువచ్చింది.
ట్రాన్స్జెండర్లకు మంచి వైద్యం, విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేయనుంది.
ట్రాన్స్జెండర్లకు సామాజిక భద్రతను కల్పించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వారి కోసం గుర్తింపు కార్డులను జారీ చేయనుంది.ఇందుకోసం బడ్జెట్ లో ఇప్పటికే రూ.2 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.అదేవిధంగా నవరత్నాల ద్వారా హిజ్రాలకు సంక్షేమ పథకాలు అందిస్తుంది.