విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాందించు కున్నాడు ధనుష్.జాతీయ నటుడిగా అవార్డు అందుకుని హాలీవుడ్ ఆఫర్స్ కూడా అందుకుంటూ అక్కడి కూడా సినిమాలు చేస్తున్నాడు.
ధనుష్ నటిస్తున్న సినిమాలన్నీ డబ్బింగ్ అయ్యి తెలుగులో కూడా రిలీజ్ అవుతూనే ఉన్నాయి.దీంతో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.
ఈయన డైరెక్ట్ తెలుగు సినిమాతో రాబోతున్నాడు.ప్రెసెంట్ ధనుష్ తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించాడు.ఈ సినిమా పట్టాలెక్కక ముందే వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేసాడు.‘సార్‘ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి చేసుకుంది.

బైలింగ్వన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ధనుష్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఇక తాజాగా సార్ నుండి ఒక అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ సినిమా తమిళ్ సహా తెలుగులో కూడా మంచి బిజినెస్ జరిపినట్టు కోలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నారు.
ఓటిటి థియేట్రికల్ హక్కులు అన్ని కలిపి 90 కోట్ల బిజినెస్ జరిగినట్టు టాక్.మరి ఇదే నిజం అయితే ధనుష్ కెరీర్ లో ఇదే హైయెస్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఇక తమిళ్ లో ‘వాతి’ పేరుతో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్నట్టు తెలిపారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే రెండు ఇండస్ట్రీల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి.చూడాలి ధనుష్ మొదటి తెలుగు సినిమా ఎంత విజయం అందుకుంటుందో.







