స్టార్ హీరోయిన్ సమంత తన అనారోగ్య సమస్యల వల్ల కొద్దిరోజులుగా బయట కనిపించలేదు.యశోద రిలీజ్ టైం లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చి మమా అనిపించిన సమంత లేటెస్ట్ గా ముంబై ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చింది.
సమంత తన ట్రీట్ మెంట్ లో భాగంగా కొన్నాళ్లు విదేశాలకు వెళ్లగా ఆఫ్టర్ గ్యాప్ సమంత బయట కనిపించింది.అయితే సమంత లో ఇదివరకు ఉన్న ఆ సరదా కనిపించలేదు.
ఎయిర్ పోర్ట్ లో కొందరు సెల్ఫీలు తీసుకున్నా సరే ఆమె ముఖం లో నవ్వు కనిపించలేదు.సమంత ఫేస్ లో నవ్వు మిస్సవడంతో ఆమె చాలా డల్ గా కనిపిస్తుంది.
సమంతకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి ట్రీట్ మెంట్ ఎంతవరకు వచ్చింది అన్నది తెలియదు కానీ సమంత ఆరోగ్యం కొద్దిగా బెటర్ అయినట్టు అనిపిస్తుంది.ప్రస్తుతం సమంత ఖుషి, శాకుంతలం సినిమాలతో వస్తుంది.
శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ ఫిక్స్ చేయగా ఖుషి సినిమా ఇంకా చాలా షూటింగ్ చేయాల్సి ఉంది.విజయ్ దేవరకొండతో సమంత చేస్తున్న ఖుషి సినిమాపై ఆడియన్స్ అంచనాలు భారీగా ఉన్నాయి.
మరి సమంత చేస్తున్న ఈ సినిమాలతో ఆమె మళ్లీ తిరిగి ఫాం లోకి వస్తుందో లేదో చూడాలి.