చిన్న పిల్లలను దేవుడి స్వరూపాలుగా భావించడం చాలా సార్లే జరుగుతుంది.వారు ఏదైనా చెబితే జరుగుతుందనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది.
అలాగే దేవీ నవరాత్రి ఉత్సవాల అప్పుడు, ప్రత్యేక పూజల అప్పుడు పిల్లలను ఆ అమ్మావారి స్వరూపంగా చేసి పూజించడం కూడా మనలో చాలా మందికి తెలిసిందే.కానీ ఆరు నెలల చిన్నారిని పూజించడం వింతగా తోస్తోంది.
వేలాది మంది భక్తులు పాప ఇంటి వద్దకు వెళ్లి పూజలు చేయడం, మొక్కులు తీర్చుకోవడం అక్కడి ప్రాంత వాసులకు పరిపాటిగా మారింది.అయితే ఇదంతా ఎక్కడ, ఎసలు అంత చిన్న పాపను వాళ్లు ఎందుకు పూజిస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్ర హింగోలిలోని కపడసింగి గ్రామంలో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది.ఆరు నెలల చిన్నారిని దేవతగా భావించి అక్కడి ప్రజలంతా పూజలు చేస్తున్నారు.స్థానికంగా ఉండే భక్తులతో పాటు విదేశాల నుంచి కూడా శిశువును చూసేందుకు తరలివస్తున్నారు.అయితే ఆరు నెలల క్రితం కపడసింగి తండాలో సుభాన్ అనే వ్యక్తికి జన్మించిన బాలిక నుదిట భాగంలో ఎరుపు, పసుపు రంగు మచ్చలు ఉండేవి.
అవి వయసుతోపాటే పెరిగి… కుంకుమ రంగులోకి మారాి.ప్రస్తుతం చిన్నారి నుదురు మొత్తం కుంకుమ రంగులో మారిపోయింది.
దీంతో ఆ పాపను అమ్మవారి స్వరూపంగా భావించి పూజలు చేయడం ప్రారంభించారు స్థానిక ప్రజలు.చిన్నారిని చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు.
ఈ విషయం ఆ నోటా ఈనోటా పాకి మీడియా ముందుకు వచ్చింది.