జగిత్యాల మున్సిపల్ ఛైర్మన్ పదవికి శ్రావణి రాజీనామా చేశారు.ఈ మేరకు ఛైర్మన్ పదవికి రిజైన్ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
తన రాజీనామాకు ఎమ్మెల్యే సంజయ్ కుమారే కారణమని శ్రావణి ఆరోపించారు.గత మూడేళ్లుగా నరకం అనుభవిస్తున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే తనను అడుగడుగునా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు.ఎమ్మెల్యే వేధింపులు భరించలేకపోయానన్నారు.
కలెక్టర్ ను కలవొద్దని ఎమ్మెల్యే ఆదేశించారని, ఒక్క పని కూడా తనతో ప్రారంభించకుండా చేశారని రోదించారు.అంతేకాకుండా డబ్బు కావాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారని, కానీ ఇవ్వలేమని చెప్పామని పేర్కొన్నారు.
ఎన్నిసార్లు అవమానించినా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్లానని ఆమె తెలిపారు.ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఈ మేరకు తనకు భద్రత కల్పించాలని శ్రావణి కోరారు.