దీప్తి షణ్ముఖ్ అభిమానులకు శుభవార్త చెప్పిన షణ్ముఖ్ తండ్రి.. మళ్లీ కలుస్తారంటూ?

యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన జోడీలలో షణ్ముఖ్ దీప్తి సునైనా జోడీ కూడా ఒకటని చెప్పవచ్చు.

ఈ జోడీ కలిసి చేసిన యూట్యూబ్ వీడియోలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

నిజ జీవితంలో కూడా ఈ జోడీ కలకాలం అన్యోన్యంగా జీవిస్తారని అభిమానులు భావించారు.అయితే దీప్తి సునైనా కొత్త సంవత్సరం రోజున షణ్ముఖ్ తో విడిపోతున్నట్టు షాకింగ్ పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది.

షణ్ముఖ్ కు ఇష్టం లేకపోయినా దీప్తి సునైనా ఆ ప్రకటన చేసిందనే కామెంట్లు వినిపించాయి.షణ్ముఖ్ మాత్రం దీప్తి సునైనాపై ప్రేమ ఏ మాత్రం తగ్గలేదనే విధంగా వ్యవహరిస్తున్నారు.

దీప్తి షణ్ముఖ్ కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేయరనే వార్తే చాలా మందిని బాధ పెడుతోంది.దీప్తి సునైనా షణ్ముఖ్ విషయంలో తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం కాదని చాలా మంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

Advertisement

అయితే తాజాగా షణ్ముఖ్ తండ్రి అటు దీప్తి సునైనా అభిమానులకు, ఇటు షణ్ముఖ్ అభిమానులకు తీపి కబురు అందించారు.దీప్తి సునైనా, షణ్ముఖ్ జశ్వంత్ కలిసే ఉంటారని ఆయన అన్నారు.దీప్తి సునైనా బ్రేకప్ చెప్పినప్పటికీ షణ్ముఖ్ బ్రేకప్ చెప్పలేదని ఆయన కామెంట్లు చేశారు.

దీప్తి సునైనా, షణ్ముఖ్ జశ్వంత్ వ్యక్తిగత జీవితాల గురించి ఇంత కంటే ఎక్కువగా మాట్లాడకూడదని షణ్ముఖ్ తండ్రి అన్నారు.

దీప్తి సునైనాకు బ్రేకప్ చెప్పాలని అనిపించి ఉండవచ్చని దీప్తి, షణ్ముఖ్ కలిసే ఉంటారని అందులో సందేహించాల్సిన అవసరం లేదని షణ్ముఖ్ తండ్రి కామెంట్లు చేశారు.షణ్ముఖ్, దీప్తి సునైనా కలవడానికి కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉందని ఆయన అన్నారు.షణ్ముఖ్ జశ్వంత్ తండ్రి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

త్వరలో దీప్తి షణ్ముఖ్ కలుస్తారేమో చూడాల్సి ఉంది.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement
" autoplay>

తాజా వార్తలు