ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల ( Celebrities )పెళ్లిళ్లు తక్కువ సమయంలోనే పెటాకులు అవుతుండటంతో అభిమానులు సైతం షాకవుతున్నారు.బుల్లితెర జంట పెళ్లైన 15 రోజులకే విడాకులు తీసుకోవడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
చాలామంది ఈ జంట విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.విష్ణుకాంత్, సంయుత ( Vishnukant, Samyutha )జోడీకి కోలీవుడ్ లో పాపులారిటీ ఉంది.
సిప్పుకుల్ ముత్తు అనే టీవీ షో ద్వారా వీళ్లిద్దరూ దగ్గరయ్యారు.దాదాపుగా ఏడు నెలల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట 2023 సంవత్సరం మార్చి నెల 3వ తేదీన పెళ్లి చేసుకున్నారు.
అయితే పెళ్లైన 15 రోజులకే విడిపోతున్నట్టు ఈ జంట విడిపోయారు.సూపర్ సింగర్ కంటెస్టెంట్ రాజ్యలక్ష్మి( Rajya Lakshmi ) ఈ జంట గురించి తాజాగా స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విడిపోవాలని ఫిక్స్ అయ్యాక ఈ జంట ఒకరినొకరు తిట్టుకుంటున్నారని ఆమె అన్నారు.

వీళ్లిద్దరూ ఒకరినొకరు దూషించుకుంటూ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని రాజ్యలక్ష్మి కామెంట్లు చేశారు.సంయుత మాట్లాడుతూ తన మాజీ భర్త చెత్త వీడియోలను చూపించేవాడని శారీరక బంధంపై మాత్రమే ఆసక్తి చూపుతున్నాడని బెడ్ రూమ్ లో కెమెరాలు పెట్టాడని చెప్పుకొచ్చారు.విష్ణుకాంత్ మాట్లాడుతూ తన భార్యకు మరో వ్యక్తితో రిలేషన్ ఉందని ఆరోపణలు చేశారు.

రాజ్యలక్ష్మి విషయానికి వస్తే ఈమె పుష్ప ది రైజ్ సినిమాలోని సామి సామి సాంగ్ తమిళ వెర్షన్ పాడిన సింగర్ కావడం గమనార్హం.ఈ సింగర్ చేసిన ఆరోపణలు సంచలనం అవుతున్నాయి.ఈ సింగర్ ఇప్పటికీ వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.పెళ్లైన 15 రోజులకే విడాకులు తీసుకోవాలనుకునే జంటలకు పెళ్లి అవసరమా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ బుల్లితెర జంటపై తీవ్రస్థాయిలో ట్రోల్స్ వస్తుండటం గమనార్హం.